కలం, వెబ్ డెస్క్ : పశ్చిమ బెంగాల్ (West Bengal) రాజకీయాలలో నేడు (జూన్ 1) కీలక పరిణామం చోటుచేసుకోనుంది. రాష్ట్ర మంత్రివర్గాన్ని విస్తరించేందుకు ముఖ్యమంత్రి సువేందు అధికారి (Suvendu Adhikari) ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈరోజు ఉదయం 11 గంటలకు నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో మొత్తం 35 మంది కొత్త మంత్రులు పదవీ స్వీకారం చేయనున్నారు. లోక్ భవన్లో జరిగే ఈ కార్యక్రమంలో గవర్నర్ ఆర్. ఎన్. రవి కొత్త మంత్రులతో పదవి, గోప్యత ప్రమాణం చేయించనున్నారు.
రాష్ట్ర పరిపాలనను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు వివిధ శాఖలకు కొత్త మంత్రులను నియమించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ కేబినెట్ విస్తరణలో సీనియర్ నాయకులతో పాటు యువ నేతలకు కూడా అవకాశం లభించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ప్రాంతీయ, సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యం ఇస్తూ మంత్రివర్గాన్ని రూపొందించినట్లు సమాచారం.
కేబినెట్ విస్తరణ అనంతరం కొత్త మంత్రులకు శాఖల కేటాయింపులు ప్రకటించే అవకాశం ఉంది. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుకు మరింత వేగం తీసుకురావడమే ఈ విస్తరణ ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పేర్కొంటోంది. ఈ కార్యక్రమంపై రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. కొత్త మంత్రివర్గం ఏర్పాటుతో ప్రభుత్వ పనితీరులో మరింత చురుకుదనం కనిపించే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

