Mobile Popup Ad
Mobile Popup Ad

జేఈఈ అడ్వాన్స్ డ్ ఫలితాలు విడుదల

కలం, వెబ్ డెస్క్ : దేశంలోని ప్రతిష్టాత్మక ఐఐటీలలో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 (JEE Advanced 2026) పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఏడాది పరీక్షను నిర్వహించిన ఐఐటీ కాన్పూర్ సోమవారం అధికారికంగా ఫలితాలను ప్రకటించింది. ఈ ఏడాది మే 17న నిర్వహించిన పేపర్ 1, పేపర్ 2 పరీక్షలకు 1,79,694 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 56,880 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. విజయం సాధించిన వారిలో 10,107 మంది మహిళా అభ్యర్థులు ఉండటం విశేషం.

అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ jeeadv.ac.inలో ఫలితాలను చూసుకోవచ్చు. ఈ పరీక్షలో ఢిల్లీ జోన్‌కు చెందిన శుభమ్ కుమార్ టాపర్‌గా నిలిచారు. విశాఖ నారాయణ కాలేజీకి చెందిన సందీప్ కు 5వ ర్యాంక్ వచ్చింది. అయితే ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ఐఐఐటీల్లో సీట్ల కేటాయింపు కోసం నిర్వహించే జోసా (JoSAA)-2026 కౌన్సెలింగ్ ప్రక్రియ రేపటి నుంచి (జూన్ 2) ప్రారంభం కానుంది.  అర్హత సాధించిన విద్యార్థులు రేపటి నుంచి తమకు నచ్చిన కాలేజీలు, కోర్సుల ఆప్షన్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>