కలం, వెబ్ డెస్క్ : ముస్లిం మహిళలకు భరోసా కల్పించడానికి ట్రిపుల్ తలాఖ్ ను బీజేపీ రద్దు చేసిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా కరీంనగర్ (Karimnagar) లో బండి శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్నర్ మీటింగ్ లో ఆయన మాట్లాడారు. ముస్లిం మహిళల సమస్యలపై ఒవైసీ ఎప్పుడైనా మాట్లాడారా? అని ప్రశ్నించారు. త్రిబుల్ తలాఖ్ (Triple Talaq) పేరుతో మహిళలకు జరుగుతున్న అన్యాయాన్ని అంతం చేస్తే.. కొందరు రాజకీయం కోసం అడ్డుపడుతున్నారని ఆరోపించారు.
దేశవ్యాప్తంగా ముస్లిం మహిళా లోకం బీజేపీకి జై కొడుతోందని వెల్లడించారు. మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే పన్నుల మోత తప్పదంటూ ఓటర్లను హెచ్చరించారు. కరీంనగర్ కార్పొరేషన్ లో బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే కేంద్రం నుంచి నిధుల వరద తీసుకొస్తానని బండి సంజయ్ హామీనిచ్చారు. కరీంనగర్ లో బీఆర్ఎస్ పనైపోయిందన్నారు. మున్సిపల్ ఎలక్షన్స్ లో ప్రతిపక్షాల పరిస్థితి దారుణంగా ఉండబోతుందని బండి (Bandi Sanjay) జోస్యం చెప్పారు.
Read Also: మున్సిపాలిటీలకు సీఎం రేవంత్ నిధులివ్వట్లేదు : బీజేపీ ఎంపీ లక్ష్మణ్
Follow Us On: Instagram


