కలం, వలిగొండ: శ్రావణ మాసంలో మహిళలు ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహించే వరలక్ష్మీ వ్రతంతో (Varalakshmi Vratam) వలిగొండ (Valigonda) మండలంలోని లోగిళ్లు పండుగ శోభను సంతరించుకున్నాయి. మహిళలు తెల్లవారుజామునే ఇళ్లను శుభ్రం చేసుకుని, స్నానాలు ఆచరించి వరలక్ష్మీ అమ్మవారిని పసుపు, కుంకుమ, పూలతో అందంగా అలంకరించారు. అనంతరం భక్తిశ్రద్ధలతో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి వ్రతాన్ని ఆచరించారు. పూజల అనంతరం ముత్తైదువులను పిలిచి వాయినాలు అందజేశారు. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఆలయాలు భక్తులతో సందడిగా మారి ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.

