కలం, వెబ్డెస్క్: ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ప్లాన్ చేసిన సభకు చివరి నిమిషంలో అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆగస్ట్ 8న రాష్ట్ర విద్యార్థులతో రాహుల్ ఛాత్రోన్ కీ గూంజ్ అనే కార్యక్రమం నిర్వహించేందుకు అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే రాహుల్ ఎంచుకున్న గ్రౌండ్లో వర్షం కారణంగా నీళ్లు ఉంటాయని, సభకు అనువైన స్థలం కాదనే కారణంతో అధికారులు అనుమతి నిరాకరిస్తూ రద్దు చేశారు. అయితే చివరి నిమిషంలో సభ నిర్వహించుకోవచ్చని చెప్పారు.

