కలం, మహబూబాబాద్: అల్పపీడన ద్రోణితో మహబూబాబాద్ (Mahabubabad) జిల్లాలో అకాల వర్షం కురిసింది. జిల్లాలోని కొత్తగూడ మండలం కార్లయి గ్రామంలో ఆదివారం వర్షం పడింది. బయ్యారం మండలంలోని బీరోనిమాడువలో మొక్కజొన్న పంట గాలివానతో నేలవాలింది. చేతికొచ్చే దశలో మొక్కజొన్న పంట నేలకొరగడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షం తమను ఆగం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి నష్టపోయిన పంటకు పరిహారం అందించాలని కన్నీటి పర్యంతమయ్యారు.
మహబూబాబాద్లో అకాల వర్షం

Previous article
Next article

