కలం, స్పోర్ట్స్: అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ సూపర్-8 పోరులో దక్షిణాఫ్రికా భారత్ (IND vs SA) ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సఫారీలు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేశారు. ఒకానొక దశలో భారత బౌలర్లు కట్టడి చేసినప్పటికీ, మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు విరుచుకుపడటంతో దక్షిణాఫ్రికా కోలుకుంది. తొలుత భారత బౌలర్లు బుమ్రా, అర్ష్దీప్ సింగ్ ధాటికి ఓపెనర్లు మార్క్రమ్ (4), క్వింటన్ డికాక్ (6) త్వరగానే పెవిలియన్ చేరారు. అయితే, ఆ తర్వాత వచ్చిన డెవాల్డ్ బ్రెవిస్, డేవిడ్ మిల్లర్ ఇన్నింగ్స్ను చక్కదిద్దారు. బ్రెవిస్ 29 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 45 పరుగులు చేసి శివమ్ దూబే బౌలింగ్లో అవుట్ అయ్యారు.
మరోవైపు ‘కిల్లర్’ మిల్లర్ తన ప్రతాపాన్ని చూపించారు. కేవలం 35 బంతుల్లోనే 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 63 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఆయనకు తోడుగా ట్రిస్టన్ స్టబ్స్ కూడా 24 బంతుల్లో 44 పరుగులు చేసి అజేయంగా నిలిచారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 3 వికెట్లతో సత్తా చాటగా, అర్ష్దీప్ సింగ్ 2 వికెట్లు, వరుణ్ చక్రవర్తి, శివమ్ దూబే తలో వికెట్ సాధించారు. భారత్ ఈ మ్యాచ్ నెగ్గాలంటే 20 ఓవర్లలో 188 పరుగులు చేయాల్సి ఉంది. అహ్మదాబాద్ పిచ్ బ్యాటింగ్కు అనుకూలించే అవకాశం ఉన్న నేపథ్యంలో, భారత బ్యాటర్లు పవర్ప్లేలో ఎలాంటి ఆరంభాన్ని ఇస్తారో చూడాలి.
Read Also: మిల్లర్ ఔట్.. భారత్కు భారం తగ్గింది..
Follow Us On : WhatsApp


