epaper
Wednesday, February 18, 2026
epaper

బ్రిటన్‌​ పార్లమెంట్​ సభ్యుడిగా తెలంగాణ వ్యక్తి.. భగవద్గీతపై ప్రమాణం

కలం, వెబ్ డెస్క్ : బ్రిటిష్​ పార్లమెంట్​ సభ్యుడిగా తెలంగాణకు చెందిన ఉదయ్​ నాగరాజు (Uday Nagaraju) బాధ్యతలు చేపట్టారు. ఎగువసభ అయిన ‘యూకే హౌస్​ ఆఫ్ లార్డ్స్​’ (House of Lords ) లో లైఫ్​ పీర్​ (Life Peer) గా ఆయన భగవద్గీతపై ప్రమాణం చేశారు. ఎగువ సభలో చారిత్రాత్మక గదిలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయనను ప్రతినిధులు అధికారికంగా పరిచయం చేశారు. హౌస్​ ఆఫ్​ లార్డ్స్​లో అతిపిన్న వయస్సు ఉన్న వ్యక్తిగా నాగరాజు రికార్డు సృష్టించారు. పాలన, విద్య, సామాజిక ఆవిష్కరణలు సహా ప్రజా జీవితంలో విశిష్టే సేవలు, నాయకత్వాన్ని ప్రదర్శించిన వ్యక్తులకు లైఫ్​ పీరేజ్​ ను ప్రదానం చేస్తారు. బ్రిటన్​ ప్రధాని కీర్​ స్టార్మర్​ సలహా మేరకు కింగ్​ చార్లెస్​ – 3, నాగరాజుకు బాధ్యతలు అప్పగించారు.

కాగా, సిద్దిపేట జిల్లా కొహెడ మండలం శనిగరానికి చెందిన నాగరాజు (Uday Nagaraju) 25 సంవత్సరాల క్రితం బ్రిటన్​ కు వెళ్లిపోయారు. ఆయన తల్లిదండ్రులు హనుమంతరావు, నిర్మాలాదేవి. నాగరాజు వరంగల్​, హైదరాబాద్​ లో విద్యాభ్యాసం చేశారు. మహారాష్ట్రలోని కిట్స్​ లో ఇంజనీరింగ్​ చదివారు. ఆ తర్వాత ఆక్స్​ ఫర్డ్​ బ్రూక్స్​ యూనివర్సిటీలో ఐటీ చేశారు. గాంధేయవాదాన్ని పెంపొందిస్తూ, ఏఐ, గ్లోబల్​ గవర్నెన్స్​ పై కృషి చేస్తున్నారు.

Read Also: రాహుల్ స‌భ్య‌త్వాన్ని ర‌ద్దు చేయండి.. స్పీకర్‌కు ఎంపీ నిషికాంత్ నోటీసులు

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>