కలం, వెబ్ డెస్క్ : మేడ్చల్ జిల్లా కీసర (Keesara) పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తిమ్మాయిపల్లి వద్ద అతివేగంగా వచ్చిన పల్సర్ బైక్ నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కనకరాజు, అరుణ్ అనే ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
స్థానికుల సమాచారం ప్రకారం.. బాధితులు టీ తాగేందుకు జవహర్ నగర్ నుంచి యాద్గర్పల్లికి బయల్దేరారు. ఈ క్రమంలో బైక్ అతివేగంగా ఉండటంతో అదుపు తప్పి చెట్టును ఢీకొనడంతో ఈ విషాద ఘటన జరిగినట్టు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న కీసర పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

