కలం, వెబ్ డెస్క్ : మేడ్చల్ జిల్లా కీసర (Keesara) పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తిమ్మాయిపల్లి వద్ద అతివేగంగా వచ్చిన పల్సర్ బైక్ నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కనకరాజు, అరుణ్ అనే ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
స్థానికుల సమాచారం ప్రకారం.. బాధితులు టీ తాగేందుకు జవహర్ నగర్ నుంచి యాద్గర్పల్లికి బయల్దేరారు. ఈ క్రమంలో బైక్ వేగంగా నడపడంతో అదుపు తప్పి చెట్టును ఢీకొట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న కీసర పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read Also: ‘అణచివేత నుంచి అధికారం వైపు’.. !
Follow Us On: WhatsApp

