కలం, వరంగల్ బ్యూరో : హనుమకొండ (Hanumakonda) జిల్లా హసన్ పర్తి (Hasanparthi) లో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెద్ద చెరువు సమీపంలో ఎస్సార్ కాలేజ్ విద్యార్థులు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని టిప్పర్ లారీ (Tipper Lorry) ఢీకొనడంతో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో మృతులు వరంగల్ జిల్లా ఎల్లం బజార్కు చెందిన సుప్రతిక, ములుగు జిల్లా మంగపేట మండలం రాజపేట గ్రామంకు చెందిన అక్రమ్గా గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
Read Also: గుడ్ న్యూస్.. భారీగా పడిపోయిన గుడ్ల ధరలు
Follow Us On: Instagram

