కలం, వెబ్ డెస్క్ : దేశం మొత్తం తమిళనాడు వైపు చూస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెలువడకముందునుంచే కొనసాగుతున్న ఉత్కంఠ ఇంకా అలాగే ఉంది. ఆ రాష్ట్రంలో 108 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే చీఫ్ విజయ్ (TVK Chief Vijay) మరోసారి తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ను కలవనున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు ఉదయం 11 గంటలకు గవర్నర్ తో భేటీ కానున్నట్లు సమాచారం. ఈ క్రమంలో కేరళం పర్యటనను గవర్నర్ రద్దు చేసుకున్నారు.

