ఇంటర్ విద్యార్థులకు అలర్ట్: సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్​ విడుదల

కలం, వెబ్​ డెస్క్​ : తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల (Inter Supplementary Exams) షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేసింది. తాజా ప్రకటన ప్రకారం మే 13వ తేదీ నుంచి సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఏప్రిల్ 13 నుంచి 20వ తేదీ వరకు నిర్ణీత పరీక్ష ఫీజును చెల్లించేందుకు బోర్డు అవకాశం కల్పించింది. థియరీ పరీక్షల అనంతరం మే 22వ తేదీ నుంచి ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.

ఇంటర్​ ఫలితాల విషయంలో సంతృప్తి చెందని విద్యార్థుల కోసం రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ ప్రక్రియను కూడా బోర్డు అందుబాటులోకి తెచ్చింది. ఇందుకు సంబంధించిన దరఖాస్తులను ఏప్రిల్ 13 నుంచి 20వ తేదీ వరకు స్వీకరించనున్నారు. విద్యార్థులు ఈ గడువులోగా ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. సప్లిమెంటరీ పరీక్షలకు సిద్ధమయ్యే వారు, రీ వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకునే వారు ఈ తేదీలను గమనించి సకాలంలో ప్రక్రియను పూర్తి చేసుకోవాలని బోర్డు సూచించింది.

Read Also:  అమర్‌నాథ్ యాత్ర షెడ్యూల్ రిలీజ్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>