కలం, మెదక్ బ్యూరో : తన తండ్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఅర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత (TRS Chief Kavitha) పర్యటించారు. ఈ సందర్భంగా సిద్ధిపేట జిల్లా గజ్వేల్ మండలం క్యాసారం గ్రామంలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి కల్యాణంలో పాల్గొని పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం బాగుండలనే అజెండా తీసుకొని బయలుదేరామని తెలంగాణ ప్రజలందరి మీద, తన పార్టీ మీద ఎల్లమ్మ తల్లి దయఉండాలని మనస్ఫూర్తిగా కొరుకున్నానని టీఆర్ఎస్ ఛీప్ కవిత అన్నారు.
Read Also: ఉమ్మడి ‘కరీంనగర్’లో ‘గులాబీ’ జెండా రీ-లోడింగ్..
Follow Us On : WhatsApp

