కలం, వెబ్ డెస్క్: అల్లూరి సీతారామరాజు జిల్లాలోని రంపచోడవరం (Rampachodavaram) ఏజెన్సీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తుందన్న వార్తలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. గిరిజన గ్రామాల చుట్టూ పులి తిరుగుతుందన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇటీవల కాకినాడలో అధికారులు పట్టుకున్న పెద్దపులిని పాపికొండల అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. ఇది అడవిలోకి వెళ్లిందా? లేక చుట్టుపక్కల గ్రామాల్లో తిరుగుతుందా? అన్నదానిపై స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో అదే పులి సమీప గ్రామాల్లో తిరుగుతుందని ప్రచారం ఊపందుకున్నది. ఈ ప్రచారంపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పులి కదలికలపై వదంతులు ప్రచారం చేయొద్దని, ఏదేమైనా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
Read Alos: మోహన్బాబు యూనివర్సిటీ విద్యార్థిని సూసైడ్
Follow Us On: Youtube

