కలం, వెబ్ డెస్క్ : ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాలో (NTR District) దారుణం జరిగింది. క్షణికావేశంలో టీచర్ పై టెన్త్ స్టూడెంట్ దాడి చేశాడు. టీచర్ వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా పిడి గుద్దులతో రెచ్చిపోయాడు. ఎన్టీఆర్ జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి జడ్పీహెచ్ ఎస్ స్కూల్ టీచర్ పై టెన్త్ క్లాస్ స్టూడెంట్ దాడి చేశాడు. చిన్న విషయం గొడవగా మారడంతో స్టూడెంట్ ను టీచర్ తిట్టాడు. దీంతో రెచ్చిపోయిన స్టూడెంట్ పిడి గుద్దులు కురిపించాడు. టీచర్ బాధపడుతూ పక్కకు నిలబడ్డాడు. స్టూడెంట్ మాట్లాడుతూ.. తన అమ్మను టీచర్ తిట్టొచ్చా.. అందుకే కొట్టా అని చెబుతున్నాడు. అసలు కారణం ఏంటనేది ఇంకా పూర్తిగా తెలియదు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

