7,437 పోలీస్ ఉద్యోగాలకు పరీక్షా తేదీలు ఖరారు

కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో ఇటీవల నోటిఫికేషన్ విడుదలైన 7,437 పోలీస్ ఉద్యోగాలకు (Telangana Police Jobs) నిర్వహించే ప్రిలిమ్స్ పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. ఎస్సై అభ్యర్థులకు నవంబర్ 29న, కానిస్టేబుల్ అభ్యర్థులకు డిసెంబర్ 20న పరీక్షలు జరుగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర పోలీస్ నియామక మండలి (TSLPRB) ఒక ప్రకటనలో వెల్లడించింది. రాష్ట్రంలో మొత్తం 7,437 పోలీస్ పోస్టుల భర్తీ ప్రక్రియను చేపడుతూ జులై 29న టీఎస్ఎల్పీఆర్బీ నోటిఫికేషన్ విడుదల చేయడం తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌ ద్వారా సివిల్ పోలీస్ కానిస్టేబుల్ (3,697), ఏఆర్ కానిస్టేబుల్ (1,052), ఎస్‌ఏఆర్‌ పీపీఎల్‌ కానిస్టేబుల్ (24), స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, కానిస్టేబుల్ (1,380), ఫైర్ ఫైటర్ (751), జైలు వార్డర్ (208) వంటి ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>