epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

తెలంగాణ పేరు మార్చాల్సి వస్తుందేమో: హైకోర్టు

రాష్ట్రంలో మద్యం దుకాణాల నియంత్రణలో ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని తెలంగాణ హైకోర్టు(High Court) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నాగారం మున్సిపాలిటీ పరిధిలోని సత్యనారాయణ కాలనీలో నివాసాల మధ్య ఏర్పాటు చేసిన మద్యం దుకాణంపై స్థానికులు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారిస్తున్న హైకోర్టు, తాజా పరిస్థితులపై కఠిన వ్యాఖ్యలు చేసింది.

కాలనీ మధ్యలో, ప్రజలు నివసించే ఇళ్ల మధ్య తాత్కాలిక నిర్మాణాలు ఏర్పాటు చేసి మద్యం షాప్ నడుపుతున్నారని, తమ అభ్యంతరాలను పట్టించుకోకుండా మున్సిపల్ అధికారులు అనుమతి ఇచ్చారని ఆరోపించారు. ప్రజలకు అసౌకర్యం కలిగించే ఇలాంటి షాపులను అనుమతించడం చట్టవిరుద్ధమని వారు పేర్కొన్నారు. ఈ వాదనలు విన్న న్యాయమూర్తి విజయ్ సేన్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో మద్యం దుకాణాల నియంత్రణలో ప్రభుత్వం తీసుకుంటున్న విధానం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. “మద్యం దుకాణాల సంఖ్య ఇలాగే పెరిగిపోతూ ఉంటే… తెలంగాణ రాష్ట్రానికి కొత్త పేరు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది” అని ఆయన వ్యాఖ్యానించారు.

తాత్కాలికంగా అయినా షాపులు ప్రధాన రహదారులపైకి కనిపించేలా కాకుండా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజల రాకపోకలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో, విద్యాసంస్థల దగ్గర, కాంపౌండ్‌ల మధ్య మద్యం షాపులు ఏర్పాటు చేయడం సరైన విధానం కాదని కోర్టు స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో, నాగారం మున్సిపాలిటీ, ఎక్సైజ్‌ శాఖ, అలాగే సంబంధిత షాపు యజమానులకు హైకోర్టు(High Court) నోటీసులు జారీ చేసింది. దుకాణానికి లైసెన్స్ ఎలా ఇచ్చారు? నివాసాల మధ్య ఎలా అనుమతించారు? నిర్మాణం చట్టబద్ధమేనా? అనే అంశాలపై అధికారులు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది.

మద్యం దుకాణాల నియంత్రణ పూర్తిగా ప్రభుత్వ విధానానికి సంబంధించినదే అయినప్పటికీ, ప్రజా ప్రయోజనాన్ని కాపాడే బాధ్యత కోర్టుపై ఉంటుందని. సమాజానికి హాని కలిగించే పరిస్థితుల్లో అవసరమైన ఆదేశాలు ఇవ్వడానికి కోర్టు వెనుకాడదని తెలిపింది. విచారణను తదుపరి తేదీకి వాయిదా వేస్తూ, సంబంధిత అధికారుల నుంచి స్పష్టమైన వివరణ కోరింది.

Read Also: దేశంలోనే టాప్ వన్‌గా హైదరాబాద్

Follow Us on: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>