కలం, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రభుత్వ ఉద్యోగులు (Telangana Employees), ఉపాధ్యాయుల పాత్రను ప్రజలు కళ్లారా చూశారు. ప్రభుత్వ నిర్వహణలోనూ వారిదే కీలక భూమిక. విద్య, వైద్యం మొదలు.. రాష్ట్ర అభివృద్ధి, పేదల సంక్షేమం వరకు ప్రభుత్వ ఫలాలు క్షేత్రస్థాయిలోకి వెళ్లాలంటే వీరి కృషి తప్పనిసరి. కొన్ని సందర్భాల్లో పవర్లోకి ఏ పార్టీ రావాలో ఉద్యోగులే డిసైడ్ చేస్తారనేది బహిరంగ రహస్యం. అందుకే వారి డిమాండ్ల విషయంలో ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉంటాయి. వెంటవెంటనే పరిష్కరించాలని భావిస్తాయి. కొత్త రాష్ట్రమైనప్పటికీ ఎక్కువ వేతనాలు ఫిక్స్ చేసింది అప్పట్లో సర్కార్. అయినా డీఏలు, పీఆర్సీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ లాంటివి అపరిష్కృతంగా ఉండిపోయాయి. వీలైనంత తొందరగా పరిష్కరించాలన్నది ఉద్యోగ సంఘాల డిమాండ్. ఆర్థిక గడ్డు పరిస్థితులను అర్థం చేసుకోవాలన్నది ప్రభుత్వ వాదన. ప్రస్తుతానికి ఇరువైపులా సహనం, సంయమనమే ఉన్నా ‘ముగింపు ఎప్పటికి’ అనేది అస్పష్టం.
వీటిన్నింటిపై కలం 360 డిగ్రీస్ కథనం చదివేందుకు కింద ఉన్న పేపర్ ఇమేజ్ పై క్లిక్ చేయండి.

Read Also: ఎంపీటీసీ ఎన్నికలెప్పుడు?.. నేడు క్యాబినెట్ భేటీలో నిర్ణయం
Follow Us On : WhatsApp


