కలం, వెబ్ డెస్క్: సెక్రటేరియట్లో ఉద్యోగుల సమస్యలు పరిష్కారాన్ని కోరుతూ శుక్రవారం తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల మహా ధర్నా (Government Employees Protest) చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ పిలుపు మేరకు సచివాలయం ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సెక్రటేరియట్ లో ధర్నా నిర్వహించారు. మధ్యాహ్న భోజన విరామ సమయంలో ప్రభుత్వ ఉద్యోగులు నల్ల రిబ్బన్లతో మహా నిరసన ప్రదర్శన చేపట్టారు. 52 శాతం ఫిట్మెంట్ తో పీఆర్సీ అమలు, హెల్త్ స్కీమ్ ని అమలు, సీపీఎస్ ని రద్దు చేసి ఓపిఎస్ను అమలు చేయాలని డిమాండ్ చేశారు.పెండింగ్ డీఏలను వెంటనే విడుదల చేయాలంటూ ఉద్యోగుల డిమాండ్ చేశారు.

