epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

దుబాయ్ ఎయిర్ షోలో కుప్పకూలిన భారత్ తేజస్..

దుబాయ్‌లో నిర్వహిస్తున్న ఎయిర్ షోలో అపశృతి చోటుచేసుకుంది. భారత్‌కు చెందిన తేజస్ లైట్‌ వెయిట్ యుద్ధ విమానం(Tejas Fighter Aircraft) ఒక్కసారిగా కూలింది. దుబాయ్ కాలమానం ప్రకారం ఈ ప్రమాదం మధ్యాహ్నం 2గంటల సమయంలో జరిగింది. ఈ ప్రమాదంలో పైలట్ మరణించినట్లు ఇండియన్ ఎయిర్‌ ఫోర్స్ నిర్ధారించింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. దుబాయ్ ఎయిర్‌ షోలో పాల్గొన్న తేజస్ విమానం ప్రమాదానికి గురైన విషయం తీవ్రంగా కలచివేసిందని తెలిపింది. పైలట్‌కు తీవ్రమైన గాయాలు కావడం వల్ల ఆయన మరణించాడని చెప్పింది. పైలట్ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపింది. ఈ క్లిష్ట సమయంలో పైలట్ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చింది. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై విచారణ ప్రారంభించినట్లు వెల్లడించింది. ఈ విమాన ప్రమాదానికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అధికారులకు అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం, పైలట్ నెగెటివ్ జీ-ఫోర్స్ టర్న్‌ నుంచి విమానాన్ని తిరిగి స్టేబుల్ పొజిషన్‌కు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాడు. అదే సమయంలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదానికి గురైన తేజస్‌ జెట్‌(Tejas Fighter Aircraft)ను హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అభివృద్ధి చేసింది. తేజస్‌కు ఇది రెండో ప్రమాదం. ఈ ఏడాది మార్చిలో రాజస్థాన్‌లోని జైసల్మేర్ సమీపంలో శిక్షణ విమానయానంలో పాల్గొంటూ మరో తేజస్ జెట్ కూలిపోయింది. అయితే ఆ ఘటనలో పైలట్‌ మాత్రం సురక్షితంగా బయటపడ్డాడు.

Read Also: ఐదేండ్లూ సిద్దరామయ్యే సీఎం.. డీకే సంచలన ప్రకటన

Follow Us on: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>