Mobile Popup Ad
Mobile Popup Ad

తుది జట్టులోకి సంజూ శాంసన్? కోచ్ కీలక వ్యాఖ్యలు!

కలం, స్పోర్ట్స్:  అహ్మదాబాద్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఎదురైన ఘోర పరాజయం తర్వాత టీమ్ ఇండియా మేనేజ్‌మెంట్ మేల్కొంది. బెంచ్‌కు పరిమితమైన ప్లేయర్లపైనా దృష్టి సారించడం మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే మిగిలిన రెండు సూపర్-8 మ్యాచ్‌ల కోసం తుది జట్టులోకి సంజూ శాంసన్‌ను తీసుకునే అంశాన్ని పరిశీలిస్తోంది. ఈ విషయాన్ని భారత బ్యాటింగ్ కోచ్ రియాన్ టెన్ డోషేట్ (Ryan ten Doeschate) వెల్లడించారు. ఆదివారం జరిగిన పోరులో 188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కేవలం 111 పరుగులకే కుప్పకూలడంతో ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో భారత టాప్ ఆర్డర్ దారుణంగా విఫలమైంది. 10 ఓవర్లు ముగిసేసరికి 51 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఫామ్‌లో ఉన్న ఇషాన్ కిషన్ డకౌట్ కాగా, శివమ్ దూబే (42) ఒక్కడే కాస్త ప్రతిఘటించాడు. ఈ నేపథ్యంలో, టాప్ ఆర్డర్‌లో ఒక రైట్ హ్యాండ్ బ్యాటర్ ఉంటే జట్టుకు వ్యూహాత్మకంగా కలిసొస్తుందని కోచ్ అభిప్రాయపడ్డారు.

మ్యాచ్ అనంతరం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన టెన్ డోషేట్ (Ryan ten Doeschate).. సంజూ శాంసన్ (Sanju Samson) అద్భుతమైన ఆటగాడని కొనియాడారు. రాబోయే రెండు కీలక మ్యాచుల్లో అతడిని ఆడించడంపై రానున్న రోజుల్లో ఖచ్చితంగా చర్చిస్తామని తెలిపారు. ఇప్పటివరకు జరిగిన ఐదు ఇన్నింగ్స్‌ల్లో నాలుగు సార్లు ప్రత్యర్థి జట్లు పార్ట్ టైమ్ ఆఫ్ స్పిన్నర్లతో బౌలింగ్ చేయించి వికెట్లు తీశాయని, దీనివల్ల తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ వంటి ఆటగాళ్లపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోందని ఆయన వివరించారు. గ్రూప్ స్టేజ్‌లో నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో సంజూ శాంసన్ 8 బంతుల్లోనే 22 పరుగులు చేసి తన ఫామ్ చాటుకున్నారు. ఇప్పుడు జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో ఆయన సేవలను వాడుకోవాలని మేనేజ్‌మెంట్ భావిస్తోంది. తదుపరి మ్యాచ్‌ల్లో భారత్ తన తప్పులను సరిదిద్దుకుని మళ్లీ గెలుపు బాట పడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. రాబోయే మ్యాచ్‌ల ఫలితాలు టీమ్ ఇండియా సెమీఫైనల్ అవకాశాలను నిర్ణయించనున్నాయి.

Read Also: మాజీ క్రికెటర్ మంజురుల్ ఇస్లాంపై బీసీబీ జీవితకాల నిషేధం!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>