మొయినాబాద్ ఫామ్​ హౌజ్ డ్రగ్స్​ కేసు.. ఎంపీ పుట్టా మహేశ్​ కు బెయిల్​

కలం, వెబ్​ డెస్క్ : తెలుగు రాష్ట్రాల్లో మొయినాబాద్ ఫామ్ హౌజ్ డ్రగ్స్ కేసు (Moinabad Farmhouse Drugs Case) కలకలం సృష్టించింది. హైదరాబాద్ శివారులోని మొయినాబాద్​ ఫామ్​ హౌజ్ లో నిర్వహించిన పార్టీలో ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్​ యాదవ్​, బీఆర్​ఎస్​ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్​ రెడ్డి సహా పలువురు ప్రముఖులు డ్రగ్స్​ తీసుకుంటూ ఈగల్ టీమ్ కు పట్టుబడ్డారు.

ఈ కేసులో ఎంపీ పుట్టా మహేశ్​ యాదవ్​ కు నిర్వహించిన యూరిన్​ టెస్టులో నెగెటివ్​ రాగా తరువాత బ్లడ్​ శాంపిల్స్​ లో డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. విచారణ అనంతరం పోలీసులు ఎంపీ పుట్టా మహేశ్​ యాదవ్​ కు నోటీసులు అందజేసి వ్యక్తిగత పూచికత్తుపై విడుదల చేశారు. మరోవైపు ఈగల్​ టీమ్ దాడుల్లో డ్రగ్స్​ తీసుకుంటూ పట్టుబడ్డ బీఆర్ఎస్​ మాజీ ఎమ్మెల్యే పైలట్​ రోహిత్​ రెడ్డిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. అయితే, ఆయనను శంషాబాద్​ పోలీసు స్టేషన్​ నుంచి కోర్టుకు తరలించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>