హైదరాబాద్‌లో జలకన్యల సందడి.. చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్ (Necklace Road) పీపుల్స్ ప్లాజాలో ‘సమ్మర్ ఉత్సవ్ మేళా’ (Summer Utsav Mela) ప్రారంభమైంది. సినీ నటుడు అలీ సతీమణి జుబేదా ఈ ప్రదర్శనను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ మేళాలో ప్రధానంగా ఫిలిప్పీన్స్ మహిళలు ప్రదర్శిస్తున్న ‘జలకన్యల లైవ్ షో’ విజిటర్స్‌ను మంత్రముగ్ధులను చేస్తోంది. వీటితోపాటు ప్యారిస్ ప్రతీక ఐఫిల్ టవర్, మ్యూజికల్ ప్యాలెస్ సెట్టింగ్‌లు సందర్శకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. వేసవి వినోదాన్ని పంచే ఈ మేళా ప్రతిరోజూ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. నగరవాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.

కాగా భానుడి భగభగలకు చెక్ పెడుతూ నగరవాసులకు ‘సమ్మర్ ఉత్సవ మేళా’ మంచి అనుభూతులను అందిస్తోంది. ఈ మేళాలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్న ‘అండర్ వాటర్ టన్నెల్ అక్వేరియం’ సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తోంది. వందలాది రకాల అరుదైన చేపలను అతి దగ్గరగా చూసే అవకాశం కల్పించడంతో పిల్లలు, పెద్దలు భారీగా తరలివస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>