కలం, ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల(Gundala) మండలం నడిమిగూడెం ప్రాంతంలో ఏసీబీ (ACB) అధికారులు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఫారెస్ట్ బీట్ అధికారి లంచం డిమాండ్ చేస్తున్నాడన్న విశ్వసనీయ సమాచారం ఆధారంగా ఈ దాడులు చేపట్టారు. ఫారెస్ట్ బీట్ అధికారి బానోతు నరేష్ ఒక పోడు రైతు వద్ద రూ.10 వేలు లంచం డిమాండ్ చేయగా, ఆ రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.
ఏసీబీ డీఎస్పీ వై. రమేష్ నేతృత్వంలోని బృందం నిఘా పెట్టి, డబ్బులు తీసుకుంటున్న సమయంలోనే నరేష్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు మాట్లాడుతూ, ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులను మోసం చేస్తూ అవినీతికి పాల్పడే ప్రభుత్వ ఉద్యోగులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

