కలం, స్పోర్ట్స్: గాయాల సమస్యల వల్ల కొద్దిరోజులుగా వెనుకబడిన భారత టెన్నిస్ స్టార్ సుమిత్ నాగల్ (Sumit Nagal), ఇప్పుడు తన మానసిక వైఖరిని పూర్తిగా మార్చుకుని మళ్లీ కోర్టులో సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. సౌత్ కొరియాతో జరగనున్న డేవిస్ కప్ మ్యాచ్కు ముందు ఆయన మాట్లాడారు. సంవత్సరం ప్రారంభంలో తొడ గాయంతో బాధపడిన నాగల్, జట్టు కోసం డేవిస్ కప్ ఆడేందుకు త్వరగా కోర్టులోకి వచ్చారు. ఆ తర్వాత మణికట్టు గాయంతో మే నెల వరకు ఇబ్బంది పడ్డారు. వరుసగా ఆడటం, కోలుకోవడం వంటి ప్రక్రియ వల్ల తీవ్ర ఒత్తిడికి గురయ్యానని ఆయన తెలిపారు.
ప్రాగ్ ఛాలెంజర్ ఓటమి తర్వాత నాగల్ తన ఆలోచనా విధానాన్ని మార్చుకున్నారు. గెలుపే లక్ష్యంగా ఆడుతూ ఒత్తిడి పెంచుకోవడం కంటే, ఆటను ఆస్వాదించడం ముఖ్యమని నిర్ణయించుకున్నారు. ఇటీవల రొమేనియా ఛాలెంజర్లో గెలవడం, యుఎస్ ఓపెన్ క్వాలిఫైయర్స్లో పోరాడటం తనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాయని ఆయన అన్నారు. ప్రస్తుతానికి టాప్-100 ర్యాంకింగ్స్ గురించి ఆలోచించకుండా, ప్రదర్శనపైనే దృష్టి పెట్టినట్లు చెప్పారు. ప్రతికూల ఆలోచనల నుంచి బయటపడి, మ్యాచ్లను ఎంజాయ్ చేయడమే లక్ష్యంగా సుమిత్ నాగల్ ముందుకెళ్తున్నారు.

