కలం, నిర్మల్: తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ (Praja Palana Dinotsavam) వేడుకలను పురస్కరించుకుని గురువారం నిర్మల్ (Nirmal) జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమాల్లో విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు కూచిపూడి నృత్యాలతో పాటు తెలంగాణ అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ నిర్వహించిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. విద్యార్థులు తమ కళా నైపుణ్యాన్ని చాటుతూ సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చిన విద్యార్థులను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం, జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అభినందించారు.

