కలం, వలిగొండ: వలిగొండ (Valigonda) పట్టణ కేంద్రంలోని వివిధ కార్యాలయాల్లో ప్రజా పాలన దినోత్సవాన్ని (Praja Palana Dinotsavam) ఘనంగా నిర్వహించారు. ఆయా కార్యాలయంలో జాతీయ జెండాలను ఎగురవేశారు. ఈ కార్యక్రమాల్లో తహసీల్దార్ దశరథ, ఎంపీడీవో జలంధర్ రెడ్డి, ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి, సర్పంచ్ కుంభం వెంకట్ పాపిరెడ్డి, పీఎస్ఎస్ చైర్మన్ గరిసే రవి, లైబ్రరీ చైర్మన్ ఆదిమూలం సోమేష్, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు బత్తిని సహదేవ్, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

