కుప్ప‌కూలిన దేశీయ స్టాక్ మార్కెట్లు!

క‌లం వెబ్ డెస్క్: ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ బడ్జెట్ ప్ర‌వేశ‌పెట్టిన వేళ దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock Markets) కుప్ప‌కూలిపోయాయి. సెన్సెక్స్ 1500 పాయింట్ల‌కుపైగా న‌ష్టాల్లో కొన‌సాగుతోంది. నిఫ్టీ 500 పాయింట్ల‌కు పైగా న‌ష్టాల‌కు చేరుకుంది. బ్యాంకింగ్, ఐటీ, మెటల్, ఫార్మా వంటి ప్రధాన రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. బడ్జెట్‌(Union Budget)లో కార్పొరేట్ రంగానికి పెద్దగా రాయితీలు లేకపోవడం, మార్కెట్ అంచనాలకు భిన్నంగా కొన్ని నిర్ణయాలు ఉండటంతో ఈ ప‌రిస్థితి నెల‌కొన్న‌ట్లు తెలుస్తోంది. పూర్తిస్థాయి బ‌డ్జెట్ వెలువ‌డిన త‌ర్వాత ప‌రిస్థితుల్లో మార్పులు వ‌చ్చే అవ‌కాశం ఉంది.

 Read Also: నిర్మలమ్మకు సాటి లేరెవ్వరు!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>