కలం, వెబ్ డెస్క్ : శ్రీశైలం (Srisailam) సున్నిపెంటలోని జెన్కో కాలనీలో చిరుతపులి సంచారం తీవ్ర కలకలం రేపింది. తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో కాలనీలోకి ప్రవేశించిన చిరుత, ఒక ఇంట్లోని కోడిని ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించింది. ఆ సమయంలో జరిగిన అలజడికి స్థానికులు మేల్కొనడంతో చిరుత అక్కడి నుంచి పారిపోయింది. జనావాసాల మధ్యకు వన్యమృగం రావడంతో జెన్కో కాలనీ ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. అటవీశాఖ అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని, నిరంతర నిఘా ఉంచాలని స్థానికులు కోరుతున్నారు.

