Mobile Popup Ad
Mobile Popup Ad

ప్రతి జిల్లాలో స్పోర్ట్స్ స్కూల్స్ ఏర్పాటు: మంత్రి పొన్నం ప్రభాకర్

కలం, మెదక్ బ్యూరో: క్రీడలను ప్రోత్సహించడానికి యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీతోపాటు ప్రతి జిల్లాలో స్పోర్ట్స్ స్కూల్స్ ఏర్పాటుచేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అన్నారు. శుక్రవారం సిద్దిపేట బాలికల ఉన్నత పాఠశాలలో సీఎం కప్ ర్యాలీని పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులనుద్దేశించి మాట్లాడారు. గ్రామీణ క్రీడాకారుల్లో ప్రతిభను వెలికితీసి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన క్రీడాకారులు గ్రామీణ స్థాయి వారేనని, క్రీడల్లో (Sports) రాణించినవారికి ప్రభుత్వ ఉద్యోగుల్లో అవకాశం ఇస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>