సోనియా గాంధీకి అస్వస్థత: ఆస్పత్రిలో చేరిక

కలం, వెబ్​ డెస్క్​ : కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ (Sonia Gandhi) అస్వస్థతకు గురయ్యారు. ఛాతీ సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆమెను కుటుంబ సభ్యులు మంగళవారం రాత్రి న్యూఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం డాక్టర్ అనూప్ బసు నేతృత్వంలోని వైద్యుల బృందం ఆమెకు చికిత్స అందిస్తోంది. సోనియా గాంధీ వెంట ఆమె కుమారుడు రాహుల్ గాంధీ, కుమార్తె ప్రియాంక గాంధీ ఉండి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్లు సమాచారం.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>