కలం, డెస్క్ : మాజీ మంత్రి జోగి రమేశ్ కు సిట్ అధికారులు షాక్ ఇచ్చారు. జోగి రమేశ్ (Jogi Ramesh) సోదరుల బెయిల్ రద్దు చేయాలని ఎక్సైజ్ కోర్టులో సిట్ పిటిషన్ వేసింది. జోగి రమేశ్ (Jogi Ramesh) చేస్తున్న వ్యాఖ్యల వల్ల గొడవలు అవుతున్నాయని.. ఆయన బెయిల్ రూల్స్ ను ఉల్లంఘించారంటూ సిట్ తెలిపింది. జోగి రమేశ్ ప్రస్తుతం కండీషన్ బెయిల్ మీద ఉన్న సంగతి తెలిసిందే. మంత్రి లోకేష్ మీద చేసిన వ్యాఖ్యలకు గాను జోగి రమేశ్ ఇంటికి టీడీపీ కార్యకర్తలు నిప్పు పెట్టారు. ఈ క్రమంలోనే సిట్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
Read Also: జనసేన నాయకులపై పవన్ కల్యాణ్ సీరియస్
Follow Us On: Instagram


