అతి వేగానికి రెండు నిండు ప్రాణాలు బ‌లి

కలం, మెదక్ బ్యూరో: సిద్దిపేట (Siddipet) జిల్లా గజ్వేల్-ప్రజ్ఞాపూర్ రింగ్ రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కరీంనగర్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తుండగా ఓవర్ స్పీడ్‌తో కారు అదుపుతప్పి డివైడర్ ఎక్కి అవతలి వైపున‌కు దూసుకెల్లి అటువైపుగా ఎదురుగా వస్తున్న లారీని బలంగా ఢీ కొట్టింది. ప్రమాద సమయంలో కారులో మొత్తం నలుగరు ప్రయాణం చేస్తుండగా.. ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు హైదరాబాద్ బోడుప్పల్ చెందిన ప్రేమ్, అనిరుధ్‌గా గుర్తించారు. కేసు నమోదు చేసిన గజ్వేల్ పోలీసులు, కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>