epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

వన్-డే సిరీస్‌కు కూడా గిల్ డౌటే..!

దక్షిణాఫ్రికాతో జరిగే వన్‌డే సిరీస్‌కు కూడా శుభ్‌మన్ గిల్(Shubman Gill) దూరం అయ్యే అవకాశాలే అధికంగా ఉన్నాయి. తొలి టెస్ట్‌లో మెడకు గాయమైన కారణంగా అతడు ఆట నుంచి తప్పుకున్నాడు. ఆ ఘాయం ఇంకా నయం కాకపోవడంతో రెండో టెస్ట్‌కు రిషబ్ పంత్(Rishabh Pant).. సారథ్య బాధ్యతలు స్వీకరించాడు. అయితే గిల్ గాయం నయం కావడానికి ఇంకా సమయం పడుతుందని వైద్యులు తెలిపారు. దీంతో అతడు వన్‌డే సిరీస్‌కు కూడా జట్టులో చేరకపోవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం ముంబైలో ఉన్న గిల్.. అక్కడే వైద్య పరీక్షలు చేయించుకుంటున్నాడు.

కాగా, దక్షిణాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్‌కు గిల్ కోలుకోవచ్చని సెలక్టర్లు భావిస్తున్నారు. ఒకవేళ టీ-20లకు కూడా గిల్(Shubman Gill) దూరమయితే.. మ్యాచ్‌లను రోహిత్(Rohit Sharma), యశస్వి జైస్వాల్ కలిసి ప్రారంభించే అవకాశం ఉంది. అభిషేక్ శర్మ రిజర్వ్ ఓపెనర్‌గా ఉండే అవకాశాలు ఉన్నాయి. హర్షిత్‌ రాణా, సిరాజ్, అర్ష్‌దీప్‌ సింగ్‌ పేస్‌ భారాన్ని మోస్తారు. ఆకాశ్‌ దీప్‌ కూడా జట్టులో స్థానం కోసం పోటీపడుతున్నాడు. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. వ్యక్తిగత కారణాలతో కుల్‌దీప్‌ యాదవ్‌ కూడా విశ్రాంతి తీసుకుంటాడని బీసీసీఐ(BCCI) వర్గాల నుంచి అందుతున్న సమాచారం. అక్షర్‌ పటేల్, వరుణ్‌ చక్రవర్తి, సుందర్‌ స్పిన్‌ బాధ్యతలు తీసుకుంటారు.

Read Also: హోరాహరీగా సాగిన ప్రీవెడ్డింగ్ క్రికెట్.. మందనాదే విజయం..

Follow Us on : Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>