epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

ఒమన్​లో ట్రెక్కింగ్​.. సింగర్​ చిత్ర సోదరి మృతి

కలం, వెబ్​డెస్క్​: ఒమన్​లో ట్రెక్కింగ్​కు వెళ్లి శద్ధ అయ్యర్ (Shraddha Iyer) అనే భారతీయ మహిళ మృతి చెందారు. స్నేహితులతో కలసి జెబెల్​ షామ్స్​ ఏరియాలోని వాడి గుల్​ పర్వత ప్రాంతాలకు ట్రెక్కింగ్​కు వెళ్లిన శ్రద్ధ(​52) ఈ నెల 2న అక్కడ జరిగిన ప్రమాదంలో చనిపోయినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. ఒమర్​ ఎయిర్​లో పనిచేసి, ప్రస్తుతం మస్కట్​లో నివసిస్తున్న శ్రద్ధ సొంతూరు కేరళలోని థాలవ. ప్రసిద్ధ అగ్రికల్చరల్​ సైంటిస్ట్​, దివంగత ఆర్​డీ అయ్యర్​, రోహిణి అయ్యర్​ దంపతుల కుమార్తె. శ్రద్ధ సోదరి చిత్ర అయ్యర్​ సింగర్​గా పనిచేస్తున్నారు. ఆర్​డీ అయ్యర్​ నిరుడు డిసెంబర్​ 11న మృతి చెందగా, థాలవలో జరిగిన ఆయన అంత్యక్రియలకు హాజరైన శ్రద్ధ.. అనంతరం అదే నెల 24న తిరిగి మస్కట్​కు వెళ్లిపోయారు. కాగా, శద్ధ అంత్యక్రియలు ఈ నెల 7న థాలవలో జరపనున్నారు. శ్రద్ధ గురించి సోదరి చిత్ర అయ్యర్​ ఇన్​స్ట్రాగ్రామ్​లో పోస్ట్​ చేసిన ఎమోషనల్​ మెసేజ్​ ట్రెండ్​ అవుతోంది.

Shraddha Iyer
Shraddha Iyer

Read Also: అమెరికా హ‌త్య కేసు నిందితుడు అరెస్ట్

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>