కలం, వెబ్ డెస్క్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు బిగ్ అలర్ట్ జారీ చేసింది. ఎస్పీఐ ఖాతాలో లింక్ అయిన యూపీఐ సర్వీసులు (SBI UPI Services) రేపు బంద్ కానున్నట్లు పేర్కొంది. ఈనెల 4వ తేదీన సాంకేతిక కారణాల వల్ల అర్థరాత్రి 00.15 గంటల నుంచి 1 గంటల వరకు దాదాపు 45 నిమిషాల పాటు ఖతాదారులు యూపీఐ సేవల్లో అంతరాయం ఎదుర్కోనున్నట్లు వివరించింది.
ఈ సమయంలో ఖాతాదారులు యూపీఐ యాప్స్ లో ఎస్బీఐ ఖాతా ద్వారా పేమెంట్స్ చేయలేరు. అయితే కేవలం యూపీఐ పేమెంట్స్ మాత్రమే నిలిచిపోతాయని, ఆర్టీజీఎస్, నెఫ్ట్, ఐఎంపీఎస్ ద్వారా యథావిధిగా ఖాతాదారులు పేమెంట్స్ చేసుకోవచ్చని సూచించింది. యూపీఐ లైట్ సేవలు మాత్రమే సాధారణంగా పనిచేస్తాయి. దీంతో ఖాతాదారులు యూపీఐ లైట్ ద్వారా సులభంగా పేమెంట్స్ చేసుకోవచ్చని తెలిపింది.

