కలం, వెబ్ డెస్క్: ఒడిశా రాజధాని భువనేశ్వర్లో (Bhubaneswar) గ్రాండ్గా జరిగిన ఫెమినా మిస్ ఇండియా 2026 గ్రాండ్ ఫినాలేలో గోవాకు చెందిన సాధ్వి సతీశ్ సైల్ (Sadhvi Satish Sail) విజేతగా నిలిచారు. ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. ఈ ప్రతిష్టాత్మక పోటీలో మహారాష్ట్రకు చెందిన రాజనందిని పవార్ ఫస్ట్ రన్నరప్గా నిలవగా, కేంద్రపాలిత ప్రాంతాల (జమ్మూ కాశ్మీర్) తరపున శ్రీ అద్వైత సెకండ్ రన్నరప్గా నిలిచారు. 61వ ఎడిషన్గా జరిగిన ఈ వేడుకలో దేశవ్యాప్తంగా 30 మంది అందాల భామలు పాల్గొన్నారు.
గతేడాది విజేత నికితా పోర్వాల్ చేతుల మీదుగా సాధ్వి (Sadhvi Satish Sail) కిరీటాన్ని అందుకున్నారు. సాధ్వి సతీశ్ మోడల్తో పాటు వ్యాపారవేత్త కూడా. రాబోయే 75వ మిస్ వరల్డ్ పోటీల్లో భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించనున్నారు.
Read Also: ప్రజా ఆశీర్వాద సభకు సర్వం సిద్ధం.. హెలికాప్టర్లో జగిత్యాలకు KCR
Follow Us On: X(Twitter)

