కలం, వెబ్ డెస్క్: రేపు జగిత్యాలలో (Jagtial) జరగనున్న ప్రజా ఆశీర్వాద సభకు సర్వం సిద్ధమైంది. సీనియర్ నేత జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న సభకు పార్టీ అధినేత కేసీఆర్ (KCR) హాజరుకానున్నారు. సోమవారం సాయంత్రం 4:45 గంటలకు ఎర్రవల్లి నివాసం నుంచి హెలికాప్టర్లో బయలుదేరనున్నారు. జగిత్యాల కలెక్టరేట్ సమీపంలోని హెలిప్యాడ్కు చేరుకుంటారు. అక్కడి నుండి నేరుగా పార్టీ కార్యాలయానికి చేరుకుని, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ముఖ్య నాయకులతో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై కేసీఆర్ భేటీ నిర్వహించనున్నారు.
సాయంత్రం 6 గంటలకు కేసీఆర్ పార్టీ కార్యాలయం నుంచి బయలుదేరి సభా ప్రాంగణానికి చేరుకుంటారు. ఈ బహిరంగ సభలో జీవన్ రెడ్డితో పాటు ఆయన అనుచరులకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించనున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఇవ్వబోయే రాజకీయ ప్రసంగంపై ఉత్కంఠ నెలకొంది. పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున తరలిరానుండటంతో జగిత్యాల మొత్తం గులాబీమయంగా మారింది.

