Mobile Popup Ad
Mobile Popup Ad

వైభవ్ ఎంట్రీపై అశ్విన్ కీలక వ్యాఖ్యలు

కలం, స్పోర్ట్స్ : భారత క్రికెట్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) అంతర్జాతీయ అరంగేట్రం ఇంకా ఆలస్యం అవుతోంది. ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో అతడు జట్టులో ఉన్నప్పటికీ తుది జట్టులో చోటు దక్కలేదు. మ్యాచ్‌ల సమయంలో ఆటగాళ్లకు వాటర్ బాటిల్స్ అందిస్తూ కనిపించడంతో ఈ అంశం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ తరఫున 700కు పైగా పరుగులు చేసిన 15 ఏళ్ల వైభవ్‌ను ఐర్లాండ్ సిరీస్‌కు ఎంపిక చేసినప్పటికీ, అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ ఓపెనర్లుగా కొనసాగడంతో అతడికి అవకాశం రాలేదు. దీంతో అభిమానులు సోషల్ మీడియాలో అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ విషయంపై టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) స్పందించారు. వాటర్ బాటిల్స్ అందించడం అవమానం కాదని, తాను కూడా కెరీర్ ప్రారంభంలో బాల్ బాయ్‌గా పని చేశానని గుర్తుచేశారు. ప్రతి అనుభవం ఆటగాడి ఎదుగుదలకు ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. అలాగే వైభవ్‌కు అద్భుతమైన భవిష్యత్తు ఉందని, మ్యాచ్‌లను బెంచ్‌పై నుంచి గమనించడం కూడా నేర్చుకునే ప్రక్రియలో భాగమని అశ్విన్ తెలిపారు. అతడి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం భారత్ జట్టు ఇంగ్లాండ్‌తో రాబోయే టీ20 సిరీస్‌కు సిద్ధమవుతోంది. ఈ సిరీస్‌లో వైభవ్‌కు అరంగేట్ర అవకాశం లభిస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>