కలం, వెబ్డెస్క్: ఆల్రౌండర్ రాధా యాదవ్ (Radha Yadav) హాఫ్ సెంచరీ (66; 47 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్లు)తో, రిచా ఘోష్ (44 ; 28 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లు), నదిన్ డి క్లెర్క్(26; 12 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లు) ధనాధన్ ఆటతో రఫ్ఫాడించడంతో ఆర్సీబీ హ్యాట్రిక్ విక్టరీ కొట్టింది. మహిళల ప్రీమియర్ లీగ్లో భాగంగా శుక్రవారం నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ 32 పరుగుల తేడాతో గుజరాత్ జెయింట్స్ జట్టుపై గెలుపొందింది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. గుజరాత్ బౌలర్లలో సోఫీ డివైన్ 3, కష్వీ గౌతమ్ 2 వికెట్లు, రేణుకా సింగ్ ఠాకూర్, జార్జియా వేర్హామ్ చెరో వికెట్ తీశారు.
ఛేదనలో జెయింట్స్ ) 18.5 ఓవర్లలో 150 పరుగులకు ఆలౌట్ అయ్యింది. భారతి ఫుల్మాలి(39; 20 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లు) టాప్ స్కోరర్. బెత్ మూనీ(27), తనూజ కన్వర్(21) ఓ మోస్తరు పరుగులు చేశారు. బెంగళూరు బౌలర్లలో శ్రేయాంక పాటిల్ 5 వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బతీసింది. లారెన్ బెల్ 3 వికెట్లు తీయగా, అరుంధతి రెడ్డి, నదిన్ డి క్లెర్క్ చెరో వికెట్ పడగొట్టారు. రాధా యాదవ్ (Radha Yadav) కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
Read Also: జడేజా ‘విశ్వ’రూపం.. విజయ్ హజారే ఫైనల్కు సౌరాష్ట్ర
Follow Us On : WhatsApp


