కలం, వెబ్ డెస్క్ : తూర్పుగోదావరి (East Godavari) జిల్లాలోని సీతానగరం(Sitanagaram)లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను, అత్తను ఓ కిరాతక భర్త కత్తితో నరికి హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. స్థానికుల సమాచారం ప్రకారం, కుటుంబ కలహాలే ఈ ఘాతుకానికి కారణమై ఉండవచ్చని అనుమానిస్తున్నారు. చిన్నచిన్న గొడవలు తీవ్ర స్థాయికి చేరుకుని చివరకు ఈ దారుణానికి దారి తీసినట్లు తెలుస్తుంది. ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు.

