కలం, వెబ్ డెస్క్: ఏపీలో తొలి ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ నిర్మాణానికి బీజేపీ నాయకురాలు, ఎంపీ పురందేశ్వరి శంకుస్థాపన చేశారు. రాజమహేంద్రవరంలోని మధురపూడి విమానాశ్రయానికి చెందిన ప్రాంతంలో అకాడమీ నిర్మాణ పనులను ఆమె ప్రారంభించారు. సుమారు రూ.100 కోట్ల పెట్టుబడితో అత్యాధునిక ఫ్లైట్ ట్రైనింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. నిర్మాణం పూర్తి అయ్యాక జార్విస్ ఫ్లైట్ ట్రైనింగ్ సంస్థ ఆధ్వర్యంలో ఎఫ్టీవో ఏర్పాటుకానుంది. శిక్షణ పొందిన పైలట్ల డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ నడవనుంది. శంకుస్థాపనలో ప్రజాప్రతినిధులు, విమానయాన రంగ నిపుణులు పాల్గొన్నారు.

