కలం, వెబ్ డెస్క్: తెలంగాణ రాజ్యసభ ఎన్నికల బరిలో కాంగ్రెస్ (Congress) పార్టీ తమ అభ్యర్థులను ఖరారు చేసింది. ఇప్పటికే ఒక స్థానానికి సీనియర్ నాయకులు అభిషేక్ మను సింఘ్వీ పేరు ఖాయం కాగా, రెండో అభ్యర్థిగా డాక్టర్ పుంజాల వినయ్ కుమార్ (Punjala Vinay Kumar)ను అధిష్టానం ఎంపిక చేసింది. వీరిద్దరి పేర్లను హైకమాండ్ అధికారికంగా ప్రకటించనుంది. రేపు (బుధవారం) ఉదయం 11 గంటలకు వీరిద్దరూ కలిసి తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. సామాజిక సమీకరణాలు, పార్టీ పట్ల విధేయత, రాజకీయ కారాణాలను దృష్టిలో పెట్టుకొని డాక్టర్ వినయ్ కుమార్కు కాంగ్రెస్ హైకమాండ్ ఈ అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది.

