కలం, వెబ్ డెస్క్: పట్టపగలే నడిరోడ్డుపై తుపాకీతో కాల్చి ఓ వ్యక్తి హత్యకు గురైన షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని లక్నోలో వెలుగు చూసింది. సందీప్ సింగ్ అనే ప్రాపర్టీ డీలర్ ఫోన్లో మాట్లాడుకుంటూ వెళ్తుండగా ఒక్కసారిగా అక్కడికి చేరుకున్న ఓ దుండగుడు అతనిపై కాల్పులు (Property Dealer Shot Dead) జరిపాడు. రౌండ్లు కాల్పులు జరిపి చనిపోయాడని నిర్ధారించుకొని అక్కడినుంచి బైక్పై పరారయ్యాడు. ఈ కాల్పుల్లో సందీప్ సింగ్ స్పాట్లోనే చనిపోయాడారు. ఇందుకు సంబందించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. మృతుడిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు సు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. నడిరోడ్డుపైనే కాల్చి చంపడంతో రాష్ట్ర ప్రజానీకం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

