కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ జిల్లా నూతన కలెక్టర్ కార్యాలయాన్ని (Karimnagar Collectorate) ఈనెల చివరి వారంలోగా సీఎం రేవంత్ చేతుల మీదగా ప్రారంభిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) స్పష్టం చేశారు. ఈ మేరకు గురువారం కరీంనగర్ కలెక్టరేట్ నూతన భవనం పనులను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ.. నూతన భవనంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ప్రారంభిస్తామని చెప్పారు. కలెక్టర్ ఆవరణలో నివాస గృహాలను తొలగించబోమని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 33 జిల్లాలను రాజకీయాలకతీతంగా అభివృద్ధి చేస్తామన్నారు. తెలంగాణలోని 33 జిల్లాలో కరీంనగర్ జిల్లా అగ్రస్థానంలో ఉండేలా కృషి చేస్తున్నామని తెలిపారు.
విద్య, వైద్యం, వ్యవసాయంలో ముందుండేలా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. మానేరు రివర్ ఫ్రంట్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే సెకండ్ బిల్ విడుదల చేసామని.. రివర్ ఫ్రంట్ ని అభివృద్ధిలోకి తీసుకొస్తామని చెప్పారు. తీగల వంతెన లోపభూష్టంగా ఉందని.. అభివృద్ధికి ఆటంకంగా డంప్ యార్డు ఉందని చెప్పారు. డంప్ యార్డును సమస్యను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వ సహకారము అవసరమని తెలిపారు. జిల్లాలో ఆగిపోయిన పనులను పూర్తి చేస్తామన్నారు. జిల్లా అభివృద్ధి ప్రజా సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా తాము పనిచేస్తున్నామని స్పష్టం చేశారు.

