epaper
Thursday, March 5, 2026
epaper

తిరుమల ఆలయంలో పొంగులేటి ప్రత్యేక పూజలు

క‌లం, వెబ్ డెస్క్‌: మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Ponguleti Srinivasa Reddy) నేడు తిరుమ‌ల (Tirumala) శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామిని ద‌ర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి తెల్లవారుజామున స్వామివారి సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మేర‌కు ఎక్స్ వేదిక‌గా ఆయ‌న ఓ పోస్టు చేశారు. స్వామివారి సేవలో పాల్గొనడం ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించింద‌ని పేర్కొన్నారు. ఆ కలియుగ ప్రత్యక్ష దైవం అనుగ్రహం ప్రజలందరిపై ఉండాలని కోరుకున్న‌ట్లు తెలిపారు. స్వామి వారి దర్శనం అనంతరం పొంగులేటికి ఆలయ పండితులు వేద ఆశీర్వచనం అందించి, స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!