కలం, వరంగల్ బ్యూరో : గ్రేటర్ వరంగల్ (Warangal) మున్సిపల్ కార్పొరేషన్ రూ. 84.20 కోట్ల స్మార్ట్ సిటీ నిధులతో అభివృద్ధి చేసిన వరంగల్ భద్రకాళి ట్యాంక్ బండ్తో పాటు రాణి రుద్రేమదేవి ఐరన్ విగ్రహాన్ని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దేవాదాయ శాఖల మంత్రి కొండా సురేఖ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, కె.ఆర్. నాగరాజు, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, నగర మేయర్ గుండు సుధారాణి, వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, హనుమకొండ కలెక్టర్, ఇంచార్జ్ మున్సిపల్ కమిషనర్ చాహత్ వాజ్పాయ్, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
Read Also: కేరళం సీఎం ఎవరు? రేసులో ముగ్గురు హేమాహేమీలు
Follow Us On : WhatsApp

