కలం, వెబ్ డెస్క్ : కాకినాడ (Kakinada) జిల్లా పిఠాపురంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పారిశుద్ధ్య కార్మికుల శిక్షణ కార్యక్రమంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. కార్యక్రమ వేదికపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu) ఫోటో లేకపోవడంతో పిఠాపురం(Pithapuram) మాజీ ఎమ్మెల్యే వర్మ (Varma) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమానికి హాజరైన వర్మ, వేదికపై ఉన్న ఫ్లెక్సీని గమనించి టీడీపీ కౌన్సిలర్లపై అసహనం వ్యక్తం చేశారు. “పార్టీలో ఇంత మంది కౌన్సిలర్లు ఉన్నారు.. ఫ్లెక్సీలో చంద్రబాబు ఫోటో ఉందో లేదో కూడా చూసుకోరా? ” అంటూ ప్రశ్నించారు.
“మా చంద్రబాబు(Chandrababu) ఫోటో లేనప్పుడు నేను వేదికపై ఎందుకు కూర్చోవాలి?” అంటూ వ్యాఖ్యానించిన వర్మ, వెంటనే కార్యక్రమం నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటన అక్కడ కొంతసేపు చర్చనీయాంశంగా మారింది. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిక్షణ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. అయితే ఫ్లెక్సీపై చంద్రబాబు ఫోటో లేకపోవడం వల్ల జరిగిన ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.

