కలం, జనగామ: మున్సిపల్ చైర్మన్ ఎన్నికలపై పర్యవేక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ అబ్జర్వర్లను నియమించింది. ప్రతి మున్సిపాలిటీకి అనుభవజ్ఞులైన ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలను అబ్జర్వర్గా ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో జనగామ (Jangaon) మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు కాంగ్రెస్ అధిష్టానం ఇద్దరు అబ్జర్వర్లను నియమించింది. ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావును నియమిస్తూ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (PCC Chief Mahesh Kumar Goud) ఆదేశాలు జారీ చేశారు.


