కలం, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) రేపు (బుధవారం) తెలంగాణలోని వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. హనుమకొండకు చెందిన నిరంజన్ అనే బాలుడు ప్రస్తుతం ఒక ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నాడు. తనను కలవాలనేది ఆ బాలుడి చివరి కోరిక అని తెలుసుకున్న పవన్ వెంటనే స్పందించాడు. స్వయంగా బాలుడి ఇంటికి వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా హనుమకొండలోని నిరంజన్ నివాసానికి చేరుకుని, బాలుడిని పరామర్శించి ధైర్యం చెప్పనున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో వరంగల్కు పవన్ కళ్యాణ్ వస్తుండటంతో స్థానిక జనసేన శ్రేణులు, అభిమానులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

